*కోల్కతాలో కేంద్ర బలగాల చీఫ్ల కీలక భేటీ.
*బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ సహా ఐదు కేంద్ర సాయుధ బలగాల అధిపతుల ఉన్నతస్థాయి సమీక్ష.
కోల్కతా,మహా.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో కేంద్రం భద్రతపై అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు, హింసాత్మక చర్యలకు తావులేకుండా పకడ్బందీగా పోలింగ్ నిర్వహించేందుకు భద్రతా బలగాలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే బీఎస్ఎఫ్ , సీఆర్పీఎఫ్ , ఎస్ఎస్బ , ఐటీబీపీ , సీఐఎస్ఎఫ్ కేంద్ర సాయుధ బలగాల అధిపతులు కోల్కతాలో అత్యవసరంగా సమావేశమయ్యారు.
రాష్ట్రంలో నెలకొన్న సున్నితమైన రాజకీయ పరిస్థితులు, గతంలో చోటుచేసుకున్న ఘర్షణల దృష్ట్యా, ఎన్నికల భద్రతపై వీరు ఒక ఉన్నతస్థాయి (హై-లెవల్) సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా స్వేచ్ఛాయుత మరియు పారదర్శక (ఫ్రీ అండ్ ఫెయిర్) పోలింగ్ను నిర్ధారించడమే ఏకైక ప్రధాన లక్ష్యంగా ఈ కీలక భేటీ సాగింది.
సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరింపు, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు చేపట్టాల్సిన చర్యలు, స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం తదితర అత్యంత కీలకమైన భద్రతా వ్యూహాలపై ఈ భేటీలో అధిపతులు సుదీర్ఘంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడాలని కేంద్ర బలగాలు కంకణం కట్టుకున్నట్లు ఈ ఉన్నతస్థాయి సమావేశం స్పష్టం చేస్తోంది.







