Mahaa Daily Exclusive

  ఎఎన్ఎన్ పురస్కార గ్రహీత వాడపల్లి ఈవోకు ఘనసన్మానం..

Share

అన్నవరం, మహా
ఎఎన్ఎన్ మీడియాగ్రూప్ ద్వారా ప్రతిష్టాత్మక మహా పురస్కారం అందుకున్న వాడపల్లి ఈవో నల్లం సూర్య చక్రధర రావును ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఎఎన్ఎన్ మీడియా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి నిర్వహించిన ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలో నల్లం చక్రధరరావు ఉద్యోగ నిర్వహణలో చేసిన సేవలకు ప్రతిష్టాత్మక అవార్డునివ్వగా, ఉద్యోగులు అభినందించారు. దేవాదాయశాఖలో చక్రధరరావు అంకితభావం, సేవను ఉద్యోగులు ప్రశంసించారు. విజయవాడ తాజ్ వివంటాలో మిరుమిట్లు గొలిపే వేదికపై జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ప్రముఖుల చేతులమీదుగా ఎఎన్ఎన్ మీడియా గ్రూప్ రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్నారు.

Latest