హైదరాబాద్, మహా: కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలంగాణకు చేరుకున్నారు. సోమవారం ఆయనను బేగంపేట విమానాశ్రయంలో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై చర్చించారు. దీనితోపాటు పలు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన తాజా రాజకీయ అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో పలువురు కీలక నేతలు ఉన్నారు.
Post Views: 50





