Mahaa Daily Exclusive

  ప్రతి భారతీయుడు ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకోవాలి: అమిత్ షా

Share

ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రతి భారతీయుడికి బోధించాలని, ప్రతి తల్లి తన బిడ్డకు చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మహారాజ్ ఛత్రపతి వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్‌ని మహారాష్ట్రకే పరిమితం చేయవద్దని, ఆయన నుంచి దేశం, ప్రపంచ ప్రేరణ పొందుతుందన్నారు. రాజమాత జిజియా బాయి యువ శివాజీ మనసులో మంచి విలువలను నింపారని, స్వరాజ్యం, స్వధర్మం, భాషను పునరుద్దరించడానికి ఆమె ప్రేరణనిచ్చిందని, అలాగే ప్రతి తల్లి పిల్లలను పెంచాలని సూచించారు.