Mahaa Daily Exclusive

  టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్‌పై చర్యలు తప్పవు: బీఆర్‌ నాయుడు

Share

: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు శనివారం తిరుపతిలో టీటీడీ గోసంరక్షణశాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారు. “గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని ఆయన మండిపడ్డారు. గోశాల మాజీ డైరెక్టర్‌ హరినాథరెడ్డి అక్రమాలు అన్నీఇన్నీ కావన్నారు. ఆయన బాగోతం బయటపడుతుందని రికార్డులు ఎత్తుకెళ్లారని విమర్శించారు. ఆయనపై కచ్చితంగా చర్యలు ఉంటాయి’’ అని బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు