Mahaa Daily Exclusive

  రూ.1కి రేషన్ బియ్యం ఇవ్వమని ఎవరు చెప్పారు: టీడీపీ ఎమ్మెల్యే

Share

రేషన్ బియ్యం పంపిణీపై కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.30 బియ్యాన్ని రూ.1కి ఎవరు ఇవ్వమని చెప్పారని ప్రశ్నించారు. కొందరు దుర్మార్గులు రేషన్ బియ్యంపై అక్రమంగా సంపాదించుకుని తమపై పెత్తనం చలాయిస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ పోర్టు వ్యవహారం చల్లబడిపోయిందని ఆరోపించారు. విజిలెన్స్ విచారణ, కేసుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు.