డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులను ఉద్దేశించి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. రాష్ట్రంలో మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ.10,000 నుంచి రూ.20,000 పెంచి వారి ఖాతాల్లోకి నగదు జమ చేశామన్నారు. ఇచ్చిన హామీని కార్యరూపం దాల్చేలా చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Post Views: 169








