విజయవాడ, మహా.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “అమరావతి కాదు… విజయవాడే మన రాజధాని” అని పేర్కొంటూ రాజధాని వ్యవహారంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విజయవాడలో క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన “అమరావతి కాదు… వాస్తవానికి విజయవాడే మన రాజధాని. అందరం ఇక్కడే ఉంటాం. మన కళ్లెదుటే పోలీసు స్టేషన్, సీపీ, డీజీపీ, ముఖ్యమంత్రి, హోం మంత్రి కార్యాలయాలు ఉన్నాయి. ఇంత సమీపంలో ఈ ఘటన జరిగినా బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. రాజధానిలోనే స్పష్టంగా ఒక రాకెట్ నడుస్తోంది” అని వ్యాఖ్యానించారు.
Post Views: 5








