ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ డివిజన్ హైదర్గూడా సుఖసాగర్ అపార్ట్మెంట్ లో నిర్వహించిన SIR (Special Intensive Revision) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘం BLO అరుణ గారితో పాటు BLAలు మీర్జా గారితో కలిసి ఓటరు జాబితాల ప్రత్యేక పరిశీలన ప్రక్రియను సమీక్షించారు.
ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను సరిచూసుకొని అవసరమైన మార్పులు చేసుకోవాలని MGR గారు కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్, D.రాజేందర్, సుశాంత్ చింటూ, కార్తీక్, విశాల్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 10








