Mahaa Daily Exclusive

  ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై తుమ్మల తీవ్ర అభ్యంతరం…!

Share

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన సందర్భంగా నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన తుమ్మల నాగేశ్వరరావు, తన 40 ఏళ్ల రాజకీయ జీవన ప్రయాణాన్ని వివరించారు. పదవుల కోసం ఎప్పుడూ ఎదుటివారి వద్ద మొక్కలేదని, ప్రజాసేవే తన ధ్యేయమని స్పష్టం చేశారు. నందమూరి తారక రామారావు నుండి రేవంత్ రెడ్డి వరకు నేతలతో పనిచేసినా ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తప్ప మరేదీ తమ లక్ష్యం కాదని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో కౌలాస్ నాలా, సింగీతం కల్యాణి, లక్ష్మీ కెనాల్, శారదా సాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులు తన మంత్రి పదవీకాలంలో పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పారిశ్రామిక ప్రాధాన్యం కలిగిన బోధన్ చక్కెర కర్మాగారం పునరుద్ధరణకు సంబంధించి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు సుదీర్ఘ సమరం ఫలితమని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన తన చర్యపై అరవింద్ విమర్శలు అనవసరమని పేర్కొన్నారు. ధర్మపురి అరవింద్ వినయంతో, రాజకీయ పరిజ్ఞానంతో వ్యవహరించాలని తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకుండా ప్రజాసేవను నిమిత్తంగా మాట్లాడితే మేలని సూచించారు. తన రాజకీయ జీవితం తెరచిన పుస్తకం లాంటిదని, ప్రతి అడుగులోనూ ప్రజల ప్రయోజనమే తన ధ్యేయమని తుమ్మల స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి తన సుదీర్ఘ ప్రయాణం తార్కాణమని పేర్కొన్నారు

Latest