కడప నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక సమావేశం నిర్వహించామ ని కడప ఎమ్మెల్యే మాదవిరెడ్డి పేర్కొన్నారు. కడప నియోజక వర్గంలో అన్ని డిపార్ట్మెంట్ లు ముఖ్యంగా రెవెన్యూ, రోడ్లు భవనాలు, మున్సిపల్ కార్పోరేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగిందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు ఎక్కడ రోడ్ల పై గుంతలు, పూడిపోయిన డ్రైనేజీ వ్యవస్థ పై దృష్టి సారించాలన్నారు. మాసా పేటలో పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.బుగ్గవంక బ్యాలెన్స్ పనులు పూర్తి చేయాలని కోరారు.
Post Views: 51








