Mahaa Daily Exclusive

  హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: కిషన్ రెడ్డి

Share

అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో మీట్ గ్రీట్ కార్యక్రమంకు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు అడిగే ధైర్యం లేకనే తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ను అధికార కాంగ్రెస్ గాలికి వదిలేసిందని.. ప్రజలను, నిరుద్యోగులను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.