పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు తాము సన్నాహాలు ప్రారంభించినట్లు డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ ఫోన్ పే ప్రకటించింది. ‘మా సంస్థ సేవలు ప్రారంభమై ఈ ఏడాదికి పదేళ్లు పూర్తవుతోంది. 12 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్నాం. ఈ సందర్భంగా ఐపీఓకు రావడం మా సంస్థ చరిత్రలో ఓ మైలురాయి’ అని పేర్కొంది. దేశంలో డిజిటల్ చెల్లింపు యాప్లలో ఫోన్ పే ఏకంగా 48శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
Post Views: 125








