Mahaa Daily Exclusive

  పీవోకేను స్వాధీనం చేసుకోండి: అభిషేక్ బెనర్జీ

Share

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వద్దని పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ‘పాకిస్థాన్‌కు మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ లేదా సింబాలిక్ బెదిరింపులకు సమయం కాదు. పీవోకేను తిరిగి పొందే సమయం వచ్చింది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.