Mahaa Daily Exclusive

  ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని శివాలయంలో పూజలు..!

Share

కూసుమంచి మే 9, మహా:

భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మరింత విజయవంతం కావాలని కోరుతూ శ్రీ శ్రీ శ్రీ ఘణపేశ్వరాలయం లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత దేశానికి విజయం లభించాలని, ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత త్రివిధ దళాలకు సంఘీభావం తెలియజేస్తూ ప్రత్యేక సంకల్పంతో ఘణపేశ్వరాలయం లోపూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…దేశ రక్షణ కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని భగవంతుడిని ప్రార్థించాం. సైనికులు సురక్షితంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని తెలిపారు.