Mahaa Daily Exclusive

  పోలీసులతో మమ్మల్ని అణచలేరు: అంబటి

Share

AP: వైసీపీ శ్రేణులను పోలీసులతో అణచలేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు మాట్లాడారు. ‘సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ పై విడుదలయ్యారు. కొమ్మినేనిపై కక్ష్యకట్టి అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న కొమ్మినేని, కృష్ణంరాజు పై అరమరావతి ప్రాంత ప్రజల ముసుగులో టీడీపీ గుండాలు దాడికి ప్రయత్నం చేశారు’ అని అంబటి తెలిపారు.