Mahaa Daily Exclusive

  యూకే మాజీ ప్రధానితో భేటీ కానున్న లోకేశ్..!

Share

ఏపీ మంత్రి నారా లోకేశ్ జూన్ 18,19 రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్నారు. విదేశీ కంపెనీల పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీల అధినేతలతో సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో భేటీ కానున్నారు. అనంతరం కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, చిరాగ్ పాశ్వాన్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. గురువారం బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్‌ని కలవనున్నారు.