పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల మీద ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని మంత్రి కొండా సురేఖ దంపతులను మల్లికార్జునఖర్గే హెచ్చరించినట్టు తెలిసింది. వరంగల్లో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదిరి పాకానపడిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒక వర్గంగా, ఎమ్మెల్యేలు కడియం, రేవూరి, నాయిని, ఎమ్మెల్సీ సారయ్య మరో వర్గంగా ఒకరిపై ఒకరు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఖర్గే కొండా దంపతులను పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. విభేదాలకు దారితీసిన విషయాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
Post Views: 63








