వైసీపీ ఎంపీ మిథున్రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మాజీ మంత్రి విడదల రజిని స్పందించారు. ‘మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆయన అరెస్టును ఖండిస్తున్నాం. ఎటువంటి ఆధారాలు లేకుండా మిథున్ను అరెస్ట్ చేశారు. జగనన్న హయాంలో లిక్కర్ స్కాం జరగలేదు. మద్యం ధర పెంచి మద్యపానాన్ని తగ్గించాం. అధికారుల్ని బెదిరించి, తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు’ అని మండిపడ్డారు.
Post Views: 46








