Mahaa Daily Exclusive

  ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం: హోంమంత్రి అనిత

Share

AP: హోంమంత్రి వంగలపూడి అనిత ‘సుపరిపాలనలో తొలి అడుగు’లో భాగంగా గురువారం ఏలూరు జిల్లా, చింతలపూడిలో పర్యటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘తల్లికి వందనం, గ్యాస్‌ రాయితీ, పింఛన్లు వస్తున్నాయా? అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకంతోపాటు.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నామని తెలిపారు. అలాగే సామాజిక పింఛను రూ.3 వేలు చేయడానికి జగన్‌కి ఐదేళ్లు పట్టిందని’ విమర్శించారు.