AP: కల్లు గీత కార్మికులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. కొత్త బార్ పాలసీ కింద బార్లలో వారికి 10 శాతం వాటా కేటాయిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లు ఉండగా, వాటిలో 84 బార్లను కల్లు గీత కార్మికులకు కేటాయించనున్నారు. ఇప్పటికే మద్యం దుకాణాల్లో 10 శాతం వాటా ఇస్తుండగా..కొత్త బార్ పాలసీ రూపకల్పనలో ఎక్సైజ్ శాఖ తుది దశ కసరత్తు జరుపుతోంది. మద్యం షాపుల తరహాలోనే బార్లకు కూడా లాటరీ విధానంలో లైసెన్సులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
Post Views: 57








