Mahaa Daily Exclusive

  సెమీ కండక్టర్ రంగంలో వేగంగా అడుగులు: మోదీ

Share

భారతదేశం సెమీ కండక్టర్ రంగంలో వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఏపీ, ఒడిశా, పంజాబ్‌కు సెమీ కండక్టర్ యూనిట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ‘ఏపీ, ఒడిశా, పంజాబ్‌లో కొత్త యూనిట్ల ఏర్పాటుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలో దేశాన్ని కీలక పాత్రధారిగా ఉంచుతుంది’ అని తెలిపారు.