AP: ఉచిత బస్సు ప్రయాణంపై వైసీపీ నేతలు, దాని అనుబంధ మీడియా చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజల స్పందనపై సీఎం రివ్యూ చేశారు. పథకాల అమలులో ఎమ్మెల్యేలు, మంత్రులు భాగస్వాములు అయ్యేలా చూడాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రజలతో మమేకం కావడం వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆయన అన్నారు.
Post Views: 49






