భవన నిర్మాణ పనులకు కంది శ్రీనివాస రెడ్డి భూమిపూజ
బేల మండలం దహెగాం గ్రామంలో 10లక్షల నిధులతో నిర్మించే వీవో భవననిర్మాణ పనులకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి బేల మండల నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, కొండా గంగాధర్, కోలా నర్సింలు, శాంతన్ రావు, నిమ్మల గౌతమ్ రెడ్డి, అశోక్, అరవింద్ , బాపూరావు ఉల్కె ,బేల మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, సర్పంచులు దంతెలా వినోద్, గంభీర్ టాక్రె, శంకర్ భోక్రె, టెకం సత్యపాల్, ఉపసర్పంచుల అధ్యక్షులు సాగర్ టాక్రె, ఉప సర్పంచులు ప్రకాష్, బండి సుదర్శన్, నాయకులు బాపూరావు ,నగేష్ రెడ్డి ,నానాజీ వైద్య, మాడవి చంద్రకాంత్, బూబాన్ రమేష్, దోటె ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.








