- ఈసారి విద్యుత్ శాఖ వంతు
హైదరాబాద్, మహా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుస నోటిఫికేషన్లు విడుదలవుతుండగా, నిరుద్యోగులు వరుస నోటిఫికేషన్లతో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. వరుసగా పరీక్షల షెడ్యూల్ సైతం విడుదల అవుతున్నాయి. నవంబర్ నెల నుంచి జనవరి వరకు వరుసగా పోటీ పరీక్షలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వదం కసరత్తు చేస్తుందని తెలుస్తోంది.11 మాసాల్లో ఇప్పటికే 50వేలకు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన రేవంత్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 3,500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో 3,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో తీపికబురు చెప్పనున్నారు. త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగానే జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు పూర్తి చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు పంపిణీ సంస్థల్లో జూనియర్ లైన్మెన్ ఖాళీల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 3,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
టీజీఎస్పీడీసీఎల్లో 1,550 వరకు జూనియర్ లైన్మెన్ పోస్టులు
హైదరాబాద్ కేంద్రంగా ఉన్నవిద్యుత్తు పంపిణీ సంస్థతో పాటు, వరంగల్ కేంద్రంగా ఉన్న విద్యుత్తు పంపిణీ సంస్థలలో భారీగా ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. మెుత్తం ఈ విద్యుత్ పంపిణీ సంస్థలలో మొత్తం 3,500 వరకు జూనియర్ లైన్మెన్, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. ఈ మేరకు ఈ పోస్టుల భర్తీకి నవంబర్ నెలాఖరుకల్లా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులలోనే టీజీఎస్పీడీసీఎల్లో 1,550 వరకు జూనియర్ లైన్మెన్ పోస్టులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈనెలాఖరుకల్లా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.







