Mahaa Daily Exclusive

  రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ఆదిలాబాద్జి ల్లా కానిస్టేబుల్ కు స్వర్ణం…!

Share

కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీసు మీట్‌లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యోగా పోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది. జైనథ్ పోలీసుస్టేషన్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ రూప యోగా పోటీల్లో స్వర్ణం కైవసం చేసుకుంది. ఆమెను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సీఐ సాయినాథ్, ఎస్ఐ పురుషోత్తం తో పాటు పలువురు అభినందించారు.