Mahaa Daily Exclusive

  తుపాకీతో కాల్చుకొని తణుకు రూరల్ ఎస్సై ఆత్మహత్య…!

Share

ప. గో. జిల్లా తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ లో తుపాకీతో కాల్చుకున్నారు. తణుకు రూరల్ ఎస్సైగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం స్టేషన్‌కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మనస్తాపంతోనే మూర్తి సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.