శాసనసభ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ హామీల్లో మహిళలకు నెలకు రూ.2500 ఒకటి. ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ హామీని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో అన్నారు. ఇక మార్చి 31లోపు వంద శాతం రైతు భరోసా డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎకరానికి రూ.10వేలు ఇస్తే, తాము రూ. 12వేలు ఇస్తున్నామని చెప్పారు.
Post Views: 59








