దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాగంటి వీరేంద్ర ప్రసాద్ (58) ఆదివారం మృతి చెందారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున దెందులూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కొద్ది రోజులుగా అస్వస్థతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్, తెదేపా, వైకాపాకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
Post Views: 114







