Mahaa Daily Exclusive

  ఏపీలోని అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమలు..!

Share

ఏపీలోని కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీలకు త్వరలో శుభవార్త అందించనుంది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత జీవో జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ జీవోతో లక్ష మందికి ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు.