Mahaa Daily Exclusive

  రేవంత్ సీఎం కావటం ప్రజల దురదృష్టం: కిషన్ రెడ్డి

Share

మెట్రో విస్తరణ తాను అడ్డుకున్నట్లు నిరూపించే దమ్ముందా అని సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ప్రాజెక్ట్ విస్తరణకు రాష్ట్రం వద్ద నయాపైసా లేక తనను దోషిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలు కేంద్రాన్ని అడిగి ఇచ్చారా అని ప్రశ్నించారు. రేవంత్ సీఎం కావటం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు. గాలిమాటలకు, బ్లాక్‌మెయిలింగ్‌కు తాను భయపడనని స్పష్టం చేశారు.