Mahaa Daily Exclusive

  సూచనలొస్తే బడ్జెట్‌లో సవరణ చేస్తాం: నిర్మలా సీతారామన్‌

Share

దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, చార్టెడ్‌ అకౌంటెంట్స్‌, లాయర్లు, వ్యాపార సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని కేంద్ర బడ్జెట్‌లో మార్పులు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఏపీలోని విశాఖలో ఆమె మాట్లాడుతూ.. ‘ఏటా బడ్జెట్‌ టేబుల్‌ చేశాక మధ్యలో గడువు ఉంటుంది. మళ్లీ పార్లమెంట్‌ మొదలయ్యాక ఫైనాన్స్‌ బిల్లుపై చర్చ, ఆ తర్వాత ఆమోదం ఉంటుంది. ముఖ్యమైన అభిప్రాయాలు, సూచనలొస్తే సవరణలు చేసి బడ్జెట్‌ను ఆమోదిస్తాం’ అని తెలిపారు.