Mahaa Daily Exclusive

  మైనింగ్ రంగంలో మహిళలను ప్రోత్సహించాలి: మంత్రి సీతక్క

Share

మహిళలకు అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారని.. అంతరిక్షంలోనే కాదు భూగర్భంలో కూడా మహిళలు పనిచేయగలరని మంత్రి సీతక్క అన్నారు. HYD-బేగంపేట వివంతా హోటల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మైనింగ్ లో మహిళల పాత్ర’ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రభుత్వ పెద్దల దాకా అందరూ మహిళలను ప్రోత్సహించాలన్నారు. మహిళా సంక్షేమం శ్రేయస్సు కోసం కేంద్రం ఎక్కువగా బడ్జెట్ కేటాయించాలని కోరుతున్నట్లు తెలిపారు.