Mahaa Daily Exclusive

  రేషన్ కార్డు దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన!

Share

ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమవుతోన్న తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణకు ఏర్పాట్లు చేస్తోంది. సివిల్ సప్లై అధికారులు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుదారులను విచారిస్తారు. కాగా కొత్త రేషన్ కార్డులు అందించడానికి ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామసభల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. అలాగే మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.