Mahaa Daily Exclusive

  ఉరేసుకొని మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య

Share

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీలో
ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న యోజిత సాహో (28) అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌కు చెందిన యోజిత అనంతపురంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టు‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.