Mahaa Daily Exclusive

  ప్రజలకు వాస్తవాలు చెప్తున్నాం: సీఎం రేవంత్

Share

అప్పులు, ఆదాయం విషయంలో అంచనాలు తప్పాయని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. ఆదాయం తగ్గింది.. అడ్డగోలుగా అప్పులు పెరిగిపోయాయని తెలిపారు. అందుకే ప్రజలకు వాస్తవాలు చెప్తున్నామని సీఎం స్పష్టం చేశారు. వసూలు చేయాల్సిన పన్నులను కూడా వసూలు చేయలేదని తెలిపారు. గతంలో ఇసుక నుంచి రోజూ రూ.1.25 కోట్లు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు రూ.3.50 కోట్ల వరకు ఆదాయం వస్తుందని రేవంత్‌ పేర్కొన్నారు.