Mahaa Daily Exclusive

  అరటి రైతులను పరామర్శించిన జగన్..1

Share

వైఎస్సార్ కడప జిల్లా లింగాలలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. అరటి తోటలను పరిశీలించిన జగన్.. బాధిత రైతులను పరామర్శించారు. మండలంలో 2,460 ఎకరాల్లో అరటి పంట నష్టం జరిగిందని అధికారులు జగన్‌కు తెలిపారు. రైతులను ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు.