జాతీయ ఆహార భద్రతా చట్టం, గర్భిణుల పథకంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ రాజ్యసభలో ప్రసంగించారు. గర్భిణుల పథకానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని, ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ ఆరోపించారు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి రూ.6వేలు ప్రసూతి ప్రయోజనాలు అందుతాయని, వాటిని రెండు విడతల్లో చెల్లిస్తామని చెప్పారని అన్నారు. కానీ ఈ పథకానికి నిధులే లేవని సోనియా గాంధీ ఆరోపించారు.
Post Views: 95








