బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సోమవారం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారని, మద్యం, విద్యుత్ తదితర విషయాల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్నారు. బీజేపీ ప్రజాగళం వినిపించింది కాబట్టే.. ఇప్పుడు ఏపీ డబుల్ ఇంజిన్తో సుపరిపాలన అందిస్తోందని పేర్కొన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమన్వయంతో ముందుకు సాగుతున్నారన్నారు.
Post Views: 131








