Mahaa Daily Exclusive

  ఆ 400 ఎకరాలు ప్రభుత్వ భూమే: ఎంపీ చామల

Share

HCU వద్ద ఉన్న 400 ఎకరాలు ప్రభుత్వ భూమేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు IMG సంస్థకు కేటాయించారని, సుప్రీంకోర్టులో పోరాడి ప్రభుత్వ భూమిని తిరిగి దక్కించుకున్నామని చెప్పారు. HCU భూముల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. 19 ఏళ్లుగా కోర్టు వివాదాలు ఉండటంతో అక్కడ చెట్లు పెరిగినట్లు వెల్లడించారు.