మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం యడవల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సన్న బియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యక్రమమని, ఇది నిరుపేదల ఆత్మగౌరవం కోసం తెచ్చిన ప్రభుత్వ పథకం అంటూ పేర్కొన్నారు. అలాగే నిరుద్యోగుల కోసం తెచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం గడువు పొడిగించామన్నారు.
Post Views: 42








