Mahaa Daily Exclusive

  రొయ్యల ధరలు తగ్గించవద్దు: సీఎం చంద్రబాబు

Share

ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భారీ ఊరటనిచ్చారు. అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించొద్దని ఎగుమతి చేసే వ్యాపారులకు సీఎం సూచించారు. 100 కౌంట్‌ రొయ్య కిలోకు రూ.220 చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. సంక్షోభం ముంగిట ఉన్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఈ మేరకు గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీరు అందిస్తామని తెలిపారు.