Mahaa Daily Exclusive

  ఏపీలో రామరాజ్యం తేవాలనేదే నా కోరిక: చంద్రబాబు

Share

సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో రామరాజ్యం తేవాలనేదే తన ఆకాంక్ష ఆయన అన్నారు. శ్రీరాముడి స్ఫూర్తితో ఏపీ ప్రజలకు మేలు చేయడమే తమ ధ్యేయమన్నారు. పరిపాలన అంటే సాక్షాత్తూ శ్రీరాముడి పాలన గుర్తుకురావాలని పేర్కొన్నారు.