Mahaa Daily Exclusive

  ఎస్సీ వర్గీకరణ అమలు చారిత్రాత్మక నిర్ణయం: మంత్రి ఉత్తమ్

Share

ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీలూ మాట్లాడినా.. ఎవరూ నిజంగా ప్రయత్నించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఏప్రిల్ 13 నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వస్తుందని, దీనికి సంబంధించిన జీవోను సీఎం రేవంత్ రెడ్డికి అందించినట్లు ఆయన తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఘట్టాలు చూశానని, ఈ చరిత్రాత్మక నిర్ణయం గర్వకారణమని ఉత్తమ్ అన్నారు.