Mahaa Daily Exclusive

  అన్ని వర్గాల్లో వెలుగు నింపిన మహనీయుడు అంబేడ్కర్: హరీశ్ రావు

Share

చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపిన మహానీయుడు అంబేడ్కర్ అని BRS MLA హరీశ్ రావు కొనియాడారు. HYD-పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో నిర్వహించిన అంబేడ్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ‘మహిళలకు, కార్మికులకు, దళిత గిరిజనులకు అన్ని వర్గాల్లో వెలుగు నింపాడు. అందరం సమాన హక్కులు పొందుతున్నామంటే దానికి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే కారణం. చదవండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి అనే మంత్రాన్ని చెప్పారు’ అని తెలిపారు.