Mahaa Daily Exclusive

  అమరావతిలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు..!

Share

ప్రధాని మోదీ మే 2న రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతారు. హెలికాప్టర్ లో రాష్ట్ర సచివాలయం వద్దకు 3.20 గం.కు చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 1.2 కి.మీ పొడవున రోడ్డు షో నిర్వహిస్తారు. 3.35 గంటలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు. 3.45 గంటలకు కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సా.5 గంటలకు ప్రధాని తిరిగి ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరతారు.