Mahaa Daily Exclusive

  గురు దక్షిణగా పీఓకేను ఇవ్వండి – ఆర్మీ చీఫ్​ను కోరిన జగద్గురు రామభద్రాచార్య..!

Share

మహా
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, తన భార్యతో కలిసి చిత్రకూట్‌ లోని జగద్గురు స్వామి రామభద్రాచార్యుల తులసీ పీఠాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఆయన రామభద్రాచార్యుల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అలాగే కాంచ్ ఆలయంలో స్వామి రామభద్రాచార్యుల చేతుల మీదుగా దీక్షను తీసుకున్నారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను తనకు దక్షిణగా ఇవ్వాలని ఆర్మీ చీఫ్​ను రామభద్రాచార్య కోరారు. అలాగే 2016 తర్వాత భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి వెళ్లి పాక్​పై దాడి చేసిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్వామిజీ స్పందించారు. శశిథరూర్ చెప్పింది నిజమేనన్నారు. శశిథరూర్ అనుభవజ్ఞుడైన నాయకుడని, తాను ఆయన చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నానని తెలిపారు.