Mahaa Daily Exclusive

  ఆదిలాబాద్ బిజెపిలో డిష్యుం..డిష్యుం పట్టణ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుమారుడి దాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాయకుడు..!

Share

ఆదిలాబాద్, మహా:

ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంప్ కార్యాలయంలో పార్టీ యువ నాయకుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న రాజకీయ, ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే తనయుడు పాయల్ శరత్ (బన్నీ), గండ్రత్ మహేందర్ ఇద్దరు యువ నాయకుల మధ్య జరిగిన తోపులాటలో మహేందర్ కు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. తర్వాత దీనిపై తనను 18 మాసాల అధికార అహంకారంతో తనపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్ దాడిచేశారంటూ మహేందర్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఆదిలాబాద్ బీజేపీ టౌన్ అధ్యక్షుడిని రక్తం వచ్చేలాగా కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్ అంటూ ఆదిలాబాద్ బీజేపీ పార్టీలో నెలకొన్న వర్గవిభేదాలపై మీడియాలో కథనాలు రావడంతో రాష్ట్రనాయకత్వం అప్రమత్తమైంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తపై పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్ చేయిచేసుకున్నాడన్న ప్రచారంతో ఒక్కసారిగా అప్రమత్తమైన నాయకత్వం విషయం తెలుసుకునేయత్నం చేసింది. అధికార క్యాంప్ ఆఫీస్ లోనే టౌన్ అధ్యక్షుడు గండ్రత్ మహేందర్ పై దాడిజరగడంతో బిజెపి హైకమాండ్ సీరియస్ కాగా, నష్టనివారణ చర్యల్లో నాయకత్వం నిమగ్నమైంది. తర్వాత తనపై దాడి జరగలేదంటూ మహేందర్ మరో పోస్ట్ పెట్టినట్లు తెలిసింది.