Mahaa Daily Exclusive

  బీజేపీని ఎదిరించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్: షర్మిల

Share

AP: దేశంలో బీజేపీని ఎదిరించి, ప్రశ్నించే దమ్ము కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. ఆదివారం కృష్ణా జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే తమ ప్రధాన అజెండా అని, బీజేపీకి తొత్తులుగా ఉన్న వారిని ప్రశ్నించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.