TG: సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వనమహోత్సవంలో పాల్గొన్న అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రాజెక్టుల కోసం నిధుల మంజూరుపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వీలునుబట్టి పార్టీ నేతలను కూడా కలిసే అవకాశముందని తెలుస్తోంది. తిరిగి ఆయన మంగళవారం రాత్రికి హైదరాబాద్కు చేరుకుంటారని సమాచారం.
Post Views: 52







